ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఈ నెల 11న ఉదయం 10 గంటలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణకు హాజరుకానున్నారు. కవితతో పాటు మనీష్ సిసోడియా, రామచంద్ర పిళ్లై, అభిషేక్లను ఒకేసారి ఈడీ విచారించనుంది. అందరినీ ఒకేచోట కూర్చోబెట్టి ఇంటరాగేషన్ చేయనుంది. కాగా విచారణ అనంతరం కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేయనున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి బలం చేకూర్చేలా సీఎం కేసీఆర్ ‘‘రేపు కవితను అరెస్ట్ చేయొచ్చు.’’ అంటూ పేర్కొన్నారు.