దిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను నేడు ఈడీ విచారణ చేయనుంది. ఈ క్రమంలో దిల్లీలోని ఈడీ కార్యాలయం ఎదుట భారీ భద్రతను కల్పించారు. ఈడీ కార్యాలయానికి దారితీసే మూడు మార్గాల్లో అధికారులు బందోబస్తును ఏర్పాటుచేశారు. నేడు ఉదయం 11 గంటలకు కవిత ఈడీ కార్యాలయానికి రానున్నారు. ఈ క్రమంలో ఈ రోజు జరగాల్సిన ఇతర కేసుల విచారణలను ఈడీ అధికారులు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. దిల్లీ లిక్కర్ స్కాం కేసు ప్రాధాన్యత దృష్ట్యా ఈ రోజు మొత్తం కేవలం కవిత విచారణపైనే అధికారులు ఫోకస్ చేయనున్నారు.