ఎనిమిదో నిజాం ముకర్రం ఝా పార్థివ దేహానికి CM కేసీఆర్ నివాళి అర్పించారు. హైదరాబాద్లోని చౌమహల్లా ప్యాలస్లో ఉన్న ఆయన పార్థివదేహానికి ఇవాళ నిజాం కుటుంబీకులు, బంధువులకు కడచూపునకు అవకాశం కల్పించారు. రేపు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిజాం అభిమానులు పార్థివదేహాన్ని చూసేందుకు అనుమతించనున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు చౌమహల్లా ప్యాలెస్ నుంచి మక్కామసీదు వరకు అంతిమయాత్ర కొనసాగనుంది. ఏడో నిజాం మీర్ఉస్మాన్ అలీఖాన్ మనవడు, చివరి నిజాం ప్రిన్స్ మీర్ అలీఖాన్ ముకర్రమ్ ఝా బహదూర్ (మీర్ బరాకత్ అలీఖాన్) (89) శనివారం అర్ధరాత్రి ఇస్తాంబుల్లోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు.