భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే మ్యాచ్కు వాంఖడే స్టేడియం వేదిక కానుంది. అయితే, ఈ స్టేడియంలో విరాట్ కోహ్లీకి మెరుగైన రికార్డు ఉంది. ఇక్కడ విరాట్ 5 మ్యాచులు ఆడాడు. మొత్తంగా 265 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు అర్ధ సెంచరీ కూడా ఉంది. 121 అత్యధిక స్కోరు. 66.25 బ్యాటింగ్ సగటు. దీంతో ఈరోజు జరిగే మ్యాచ్లో కోహ్లీ రాణిస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. కాగా, ఈ మ్యాచ్కి రోహిత్ దూరమయ్యాడు. హార్దిక్ పాండ్యా కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.