తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు వరంగల్ జిల్లా ఏనుగల్లులో ఏర్పాటుచేస్తున్న క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని KTR ప్రారంభిస్తారు. ఆ తర్వాత మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో స్వయం సహాయక సంఘాల ప్రతినిధులకు రూ.750 కోట్ల వడ్డీలేని రుణాలను, అభయహస్తం డబ్బులను పంపిణీ చేస్తారు. 500 మందికి ఉచితంగా కుట్టుమిషన్లు అందిస్తారు. అలాగే తొర్రూరు పట్టణంలో పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో KTR పాల్గొంటారు.