నాగ్పూర్లో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. మద్యం సేవిస్తూ, వయాగ్రా తీసుకున్న 41 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మద్యం సేవించి రెండు 50mg సిల్డెనాఫిల్ ట్యాబ్లెట్లు తీసుకున్న బాధితుడు… ఆ మరుసటి రోజు అస్వస్థతకు గురయ్యాడు. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు గుర్తించారు. సెరెబ్రోవస్కులర్ హెమరేజ్ అంటే మెదడుకు ఆక్సిజన్ పంపిణీ తగ్గడంతో అతడు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. అతడికి అప్పటికే హై బీపీ ఉండటం దానికి తోడు ఆల్కహాల్, మెడిసిన్ వల్ల ప్రాణాలు పోయినట్లు వైద్యులు నిర్ధరించారు.