గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. పెదకకాని మండలం తక్కెళ్లపాడులో యువకుడి దాడిలో గాయపడిన ఎంబీబీఎస్ విద్యార్థిని మృతిచెందింది. తపస్వి అనే యువతిపై జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి సర్జికల్ బ్లేడుతో దాడి చేశాడు. ఆమెకు తీవ్ర గాయాలవ్వటంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. యువతిపై దాడి అనంతరం అతడి చేయిని బ్లేడుతో కోసుకున్నాడు .నిందితుడు ఐటీ కంపెనీలో పనిచేస్తున్నట్లు గుర్తించారు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.