భారత మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ సరికొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. చేపల వ్యాపారం చేయనున్నాడు. రాంచీలోని తన ఫాంహౌజ్లో 7 నెలల క్రితం రెండు చేపల చెరువులు తవ్వించి పిల్లలను వదిలాడు. ప్రస్తుతం అవి పెరిగి పెద్దయ్యాయి. రోహు, కట్ల, తిలాపియా రకం చేపలను ధోనీ పెంచుతున్నాడు. ప్రస్తుతం వాటిని విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ధోనీ వీలు చిక్కినప్పుడుల్లా తన ఫాంహౌజ్కు తప్పకుండా వెళ్తాడు. అక్కడి పంటలు, కడక్నాథ్ కోళ్లను, చేపల చెరువులను పరిశీలిస్తూ ఉంటాడు.