ఐపీఎల్ 2022లో భాగంగా ముంబై, ఢిల్లీ మధ్య జరుగుతున్న రెండో మ్యాచులో ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేసింది. MI ఓపెనర్ ఇషాన్ కిషన్(81*)పరుగులతో రెచ్చిపోవడంతో 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి, 177 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 41 పరుగులు చేయగా.. మిగతా బ్యాటర్ విఫలమయ్యారు. అటు ఢిల్లీలో కుల్దీప్ యాదవ్కు 3, ఖలీల్ అహ్మద్కు 2 వికెట్లు పడ్డాయి.