దిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలివాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి తనను లైంగిక వేధించినట్లు వెల్లడించారు. DCW అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ‘నాల్గో తరగతి వరకు మా తండ్రితోనే కలిసి ఉన్నా. నన్ను ఆయన అకారణంగా కొట్టేవారు. రక్తం కూడా వచ్చేది. ఆయన ఇంట్లోకి వస్తే చాలా భయమేసేది. ఎన్నోసార్లు మంచం కింద దాక్కున్నా. ఆ సమయంలో మహిళల హక్కుల గురించి ఆలోచించేదాన్ని’ అని స్వాతి తెలిపారు.