ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. శ్రీకాకుళం ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి నర్తు రామారావు విజయం సాధించారు. రామారావు తన సమీప అభ్యర్థిపై 524 ఓట్ల తేడాతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ ఎన్నికలో మొత్తం 752 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీటిలో 12 ఓట్లు చెల్లకపోగా.. ఇండింపెండెంట్ అభ్యర్థి ఆనెపు రామకృష్ణకు 108 ఓట్లు పోలయ్యాయి. రామారావుకు 632 ఓట్లు పోలయ్యాయి.
చెబితే ఒక్క రూపాయి ఇవ్వరు: కేసీఆర్