గత నెల 5న నిర్వహించిన నీట్ పీజీ ప్రవేశ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు అర్హత సాధించిన విద్యార్థులందరికీ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ అభినందనలు తెలిపారు. నీట్ పీజీ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ నిర్వహించి సకాలంలో రిజల్ట్స్ విడుదల చేసిన ఎన్బీఈఎంఎస్ను ప్రశంసలతో ముంచెత్తారు. ఫలితాలను https://natboard.edu.in/index వెబ్సైట్లో తెలుసుకోవచ్చని మంత్రి తెలిపారు. ఈ నెల 25 నుంచి విద్యార్థులు తమ స్కోరు కార్డులను పొందవచ్చని పేర్కొన్నారు.