నేపాల్ జట్టును అదృష్టం వరించింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో యూఏఈపై డక్వర్త్ లూయిస్ పద్ధతిలో గెలుపొందింది. వర్షం పడే సమయానికి నేపాల్ 6 వికెట్లు కోల్పోయి 269 పరుగులు చేసింది. ఎంతకూ వర్షం తగ్గకపోవడంతో డక్వర్త్ లూయిస్ పద్థతి ప్రకారం 9 రన్స్ ముందు ఉన్న నేపాల్ను విజేతగా ప్రకటించారు. దీంతో వన్డే వరల్డ్కప్ క్వాలిఫయర్స్కు అర్హత సాధించింది. ఇంతకు ముందు స్కాట్లాండ్, ఒమన్లో అర్హత సాధించాయి. ఇప్పుడు నేపాల్ మూడో జట్టుగా నిలిచింది.