ఐపీఎల్ సన్రైజర్స్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ మరోసారి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును అందుకున్నాడు. ఫిబ్రవరి నెలకు గాను బ్రూక్ ఎంపికయ్యాడు. గతేడాది డిసెంబరులోనూ హ్యారీ బ్రూక్ ఈ అవార్డు అందుకున్నాడు. మూడు నెలల వ్యవధిలోనే రెండు అవార్డులు అందుకోవడం ఈ ఇంగ్లాండ్ ప్లేయర్ ఫామ్ని తెలియజేస్తుంది. గతేడాది జరిగిన వేలంలో బ్రూక్ని ఎస్ఆర్హెచ్ రూ.13.25 కోట్లకు కొనుగోలు చేసింది. మరోవైపు, వుమెన్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును ఆసీస్ ఆల్రౌండర్ ఆశ్ గార్డ్నర్ అందుకుంది.