AP: నగరిలో మరోసారి అంతర్గత విభేదాలు బట్టబయలయ్యాయి. సొంతపార్టీ నాయకుల నుంచి మంత్రి రోజాకు నిరసన తప్పడం లేదు. తిరుపతి జిల్లా పడమాలపేట మండలం పత్తిపుత్తూరు సచివాలయ భవనాన్ని నాటకీయ పరిణామాల మధ్య మంత్రి రోజా శనివారం ప్రారంభించారు. సచివాలయ భవనంతో పాటు పక్కనే కలిసి నిర్మించిన మిగతా భవనాలు పెండింగు బిల్లులు మంజూరు కాకుండానే రోజా ప్రారంభించడాన్ని వైకాపా జడ్పీటీసీ మురళీధర్ రెడ్డి అడ్డుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని శాంతి భద్రతలను పర్యవేక్షించారు.
మరోసారి మంత్రి రోజాకు చుక్కెదురు

Courtesy Facebook: Roja Selvamani