పవన్ కళ్యాణ్పై ఏపీ మంత్రులు దాడిశెట్టి రాజా, గుడివాడ అమర్నాథ్ విరుచుకుపడ్డారు. పవన్ రూ.1800 కోట్లు పోలాండ్కు హవాలా చేస్తూ సాక్ష్యాధారాలతో కేంద్రం చేతికి చిక్కాడని దాడిశెట్టి రాజా సంచలన ఆరోపణలు చేశారు. మూడు నెలలుగా దీనిపై ప్రచారం జరుగుతోంది అని విమర్శించారు. అటు జనసేన పార్టీ పేరు చంద్రసేనగా మారిస్తే పర్ఫెక్ట్గా ఉంటుందని మరో మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. అసలు తమ కుటుంబం గురించి మాట్లాడటానికి పవన్ కళ్యాణ్కు సిగ్గుందా? తమది పవన్లా ప్యాకేజీలకు తాళాలు కొట్టే కుటుంబం కాదన్నారు. మంత్రులను తిట్టడానికే పవన్ సభ పెట్టారు అని తీవ్రవ్యాఖ్యలు చేశారు.
News Telangana
బండి సంజయ్ ఎవడ్రా: బాబు మోహన్ బూతు పురాణం