సొంత పార్టీ నేతలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెద్ద రెడ్లు కేసీఆర్కు అమ్ముడు పోయారు అని ఆరోపించారు. అందువల్లే కొత్త తరానికి అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. ఈ కారణం వల్లనే తాను పీసీసీ ప్రెసిడెంట్ అయినట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ రెండో స్థానంలో ఉందన్నారు. 32-34 ఓటింగ్ శాతంలో ఉన్నామనీ.. మరో 5 శాతం ఓట్ల కోసం పోరాటం చేస్తున్నట్లు వెల్లడించారు.