కర్ణాటక పర్యటనలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ హయాంలో కరెంటు ఇవ్వకపోవడం వల్లే జనాభా పెరిగిందని పేర్కొన్నారు. ‘అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. వాళ్లు ఉచిత విద్యుత్ ఇస్తామంటే మీరు నమ్ముతారా? వారు అధికారంలో ఉన్నప్పుడు అసలు కరెంటే ఇచ్చేవారు కాదు. గ్రామాల్లో విద్యుత్ ఉండేది కాదు. అందువల్లే జనాభా పెరిగిపోయింది’ అని ప్రహ్లాద్ జోషి అన్నారు.