నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్ భారత్ చేరుకున్నారు. బుధవాారం సాయంత్రం అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆయన చేరుకున్నారు. రేపు జరగబోయే ఇండియా-ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ను భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలసి ఆంటోనీ వీక్షించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియాలో అరుదైన ఖనిజాల అన్వేషణకు సంబంధించిన ఒప్పందాలను కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయి.