టీమిండియా నయా వాల్ చెతేశ్వర్ పుజారా, స్పిన్నర్ అశ్విన్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఆసీస్తో నాలుగో టెస్టు చివరి రోజున పుజారా ఒక ఓవర్ బౌలింగ్ చేశాడు. ఈ ఫొటోను షేర్ చేస్తూ ‘ఇలా అయితే మేమేం చేయాలి.. జాబ్ మానేసుకోవడమేనా?’ అంటూ అశ్విన్ ట్విటర్లో సరదాగా ట్వీట్ చేశాడు. దీనికి పుజారా బదులిచ్చాడు. ‘కాదు. నాగ్పూర్ టెస్టులో నా తరఫున వన్డన్లో బ్యాటింగ్కి వెళ్లినందుకు కృతజ్ఞతగా ఈ బౌలింగ్’ అంటూ పుజారా రిప్లై ఇచ్చాడు. దీంతో ట్విటర్లో ఫ్యాన్స్ తెగ రీట్వీట్ చేస్తున్నారు.