ఉత్తర్ప్రదేశ్ ఆగ్రాలో దారుణం జరిగింది. అత్యాచార వేధింపులు తాళలేక 14ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. 7వ తరగతి చదువుతున్న బాలికపై స్నేహితురాలి తండ్రి రాఘవేంద్ర(45) అత్యాచారానికి పాల్పడ్డాడు. పైగా, పలుమార్లు ఇంటికి రావాలని తరచూ ఫోన్ చేస్తుండేవాడు. దీంతో ఈ వేధింపులు తట్టుకోలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలిక ఉరేసుకుని చనిపోయింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని తనకు చెప్పిందని, కూతురు భవిష్యత్ని దృష్టిలో పెట్టుకుని నిస్సహాయ స్థితిలో మిగిలిపోయానని బాలిక తండ్రి ఆవేదన చెందాడు.