ఫిబ్రవరి నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్(POTM) రేసులో టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా నిలిచాడు. ఫిబ్రవరిలో ఆసీస్తో జరిగిన తొలి రెండు టెస్టుల్లో జడ్డూ ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. ఈ రెండు టెస్టుల్లోనూ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు గెలుచుకున్నాడు. దీంతో ఐసీసీ జడేజాను ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీగా ఎంపిక చేసింది. జడేజాతో పాటు ఇంగ్లాండ్ బ్యాట్స్మన్ హ్యారీ బ్రూక్, వెస్టిండీస్ యువ స్పిన్నర్ గుడకేశ్ మోటి ఈ అవార్డు రేసులో ఉన్నారు. జనవరి నెలకు ప్లేయర్ ఆఫ్ ద మంత్గా శుభ్మన్ గిల్ ఎంపికయ్యాడు.