తెలుగురాష్ట్రాల్లో బంగారం ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. ఈరోజు హైదరాబాద్లో 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.190 పెరిగి రూ.52,200కు చేరింది. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.210 పెరిగి రూ.56,950కి ఎగబాకింది. అటు వెండి ధరలు భారీగా పెరిగాయి. కేజీ వెండి ధర ఈరోజు రూ.1800 పెరిగి రూ.75,800కు చేరుకుంది. మరోవైపు విజయవాడలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నయి.