‘ఆర్ఆర్ఆర్’ మూవీ టీం రెండు వర్గాలుగా విడిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఆస్కార్ అవార్డ్స్కు అమెరికా వెళ్లేటప్పుడూ.. తిరిగి హైదరాబాద్ వచ్చేటప్పుడు అందరూ విడివిడిగానే వచ్చారు. తొలుత ఎన్టీఆర్ హైదరాబాద్ రాగా అనంతరం డైరెక్టర్ రాజమౌళి వచ్చారు. ఆతర్వాత రామ్చరణ్ హైదరాబాద్ రాకుండా నేరుగా ఢిల్లీ వెళ్లారు. అక్కడ ప్రధాని మోదీ, దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్తో భేటీ కానున్నారు. ఈ భేటీకి చెర్రీ ఒక్కడే హాజరవడం.. ఎన్టీఆర్ హాజరుకాకపోవడంతో అనుమానాలు రేకెత్తుతున్నాయి.