గుజరాత్ తీరంలో మరోసారి భారీగా మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. అరేబియా సముద్రంలో ఓ ఇరాన్ బోటును పట్టుకున్న ఇండియన్ కోస్ట్ గార్డ్ దళం.. దాని నుంచి 61 కిలీలో హెరాయిన్ను స్వాధీనం చేసుకుంది. దీని మార్కెట్ విలువ సుమారు రూ. 425 కోట్లు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. గుజరాత్లోని ఓఖా తీరానికి 340కి.మీ దూరంలో దీనిని పట్టుకున్నట్లు స్పష్టం చేశారు. బోటులోని ఐదుగురు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వివరించారు.