వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ను కలిశారు. హైదరాబాద్లోని రాజ్భవన్కు వెళ్లి సమావేశం అయ్యారు. రెండ్రోజుల క్రితం ప్రగతిభవన్ ముట్టడికి వెళ్లిన ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వాహనం దిగకపోవటంతో కారులో ఉండగానే తాడు కట్టి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన గవర్నర్ అలా చేయడం సరైంది కాదని పేర్కొన్నారు. దీంతో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
గవర్నర్తో షర్మిల భేటీ

© ANI Photo