తెలంగాణలోని బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలంటూ వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు. మహిళలపై అసభ్య పదజాలంతో దూషణలకు దిగినవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మహిళలను అసభ్యకరంగా దూషించిన బీఆర్ఎస్ నేతల వీడియో క్లిప్పింగులను ఆమె NCWకు అందజేశారు. కాగా బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకుంటామని షర్మిలకు NCW ఛైర్మన్ రేఖా శర్మ హామీ ఇచ్చారు.