ఏపీ అసెంబ్లీ ఎదుట నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరసనకు దిగారు. తన నియోజకవర్గంలోని సమస్యలపై ప్రకార్డులు ప్రదర్శించారు. సభలో మైక్ ఇవ్వకపోతే అసెంబ్లీ జరిగినన్ని రోజులు ప్లకార్డ్ ప్రదర్శిస్తూ నిలబడే ఉంటానని తేల్చి చెప్పారు. ‘నాలుగేళ్లుగా మంత్రులు, అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నా. సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు. నియోజకవర్గంలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి. జగనన్న కాలనీలో కనీస వసతులు లేవు. సమస్యల గురించి నేరుగా సీఎంకు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది’ అని కోటంరెడ్డి అన్నారు.