తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల వరకు సమయం పడుతోంది. వైకుంఠ కాంప్లెక్సుల్లోని 6 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. నిన్న స్వామివారిని 56 వేలమంది భక్తులు దర్శించుకున్నారు. మరో 21 వేలమంది తలనీలాలు సమర్పించారు. మంగళవారం శ్రీవారి ఆదాయం రూ.3.31 కోట్లు వచ్చినట్లు టీటీడీ పేర్కొంది.