రాజస్థాన్లోని చురు జిల్లాలో ఓ వింత శిశువు జన్మించింది. రతన్గఢ్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో రెండు గుండెలు, నాలుగేసి కాళ్లు, చేతులతో ఆడ శిశువు పుట్టింది. అయితే, ఆ శిశువు పుట్టిన 20 నిమిషాల్లోనే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రజల్దేసర్ ప్రాంతానికి చెందిన హజారీ సింగ్ అనే 19 ఏళ్ల మహిళ ఈ బిడ్డకు జన్మనిచ్చినట్లు పేర్కొన్నారు. ఆమెకు చేసిన సోనోగ్రఫీ పరీక్షలో బిడ్డ వింతగా కనిపించిందన్నారు. అయితే ఇదే పరీక్షను పలు ఆసుపత్రులు చేయగా బిడ్డ సాధారణంగానే ఉన్నట్లు వచ్చిందని వివరించారు.