సోషల్ మీడియాపై ప్రభుత్వం మరింత పట్టు
సామాజిక మాధ్యమాల నియంత్రణపై కఠినంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం మరో నిబంధన తీసుకొచ్చింది. ఇకపై ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాంలలో ఎవరి అకౌంట్ అయినా తొలగిస్తే వారు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయవచ్చు. ఈ మేరకు నిబంధనలు తీసుకొచ్చారు. దీనికోసం కేంద్రం ఓ కమిటీ (GAC)ని ఏర్పాటు చేస్తోంది. ఎవరి అకౌంట్ అయినా సస్పెండ్ అయ్యి, సంబంధిత సోషల్ మీడియా నుంచి సరైన కారణం తెలపకపోతే…30 రోజుల్లో బాధితుడు GACకి ఫిర్యాదు చేయవచ్చు. నెల రోజుల్లోగా ఈ ఫిర్యాదును పరిష్కరించేలా నూతన నిబంధనలు తీసుకొచ్చారు.