• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘ఆ పార్టీల పొత్తుతో రాజకీయ సునామీ’

    AP: జనసేన, తెదేపా కలయిక రాజకీయ సునామి సృష్టిస్తుందని మాజీ మంత్రి హరిరామజోగయ్య అన్నారు. రాబోయే పదేళ్ల కాలంలో ఏ రంగాల్లో లక్ష్యాన్ని నిర్ధారించుకోవాలో పవన్‌కు లేఖ ద్వారా సూచించినట్లు తెలిపారు. 1 నుంచి 10వ తరగతి వరకు ఉచిత విద్యతోపాటు రవాణా సౌకర్యం అందించాలని కోరానన్నారు. అలాగే కళాశాల విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఉచిత పంట బీమా సౌకర్యం, మద్దతు ధర, వ్యవసాయ పెట్టుబడులకు ఏడాదికి రూ.20 వేల సాయం వంటి సూచనలు చేసినట్లు వివరించారు.

    1న జనసేన-టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టో

    AP: జనసేన, టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టోను నవంబర్‌ 1న ప్రకటి­స్తా­మని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. ఆ తర్వాత ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తామన్నారు. మేనిఫెస్టోలో ఎలాంటి అంశాలు ఉండాలి? ఉమ్మడి పార్టీల ప్రాధాన్యత వంటి అంశాలు సమన్వయ కమిటీ భేటీలో చర్చకు వచ్చినట్లు చెప్పారు. జనసేన, టీడీపీ కలయిక కోసం ప్రజలు మూడేళ్లుగా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. తాము వైసీపీకి కాదని ఆ పార్టీ విధానాలకే వ్యతిరేకమని పవన్‌ స్పష్టం చేశారు. వైసీపీ నేతలు మద్యంపై రూ.30 వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు.

    వైసీపీని ఇంటికి పంపాల్సిందే: పవన్

    వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాల్సిన సమయం వచ్చిందని జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. వైసీపీ నేతలు అన్ని పార్టీల నాయకుల్నీ ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధే జనసేనకు ముఖ్యమని తెలిపారు. టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ భేటీ ముగిసింది. అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. ఈ రాష్ట్రానికి వైసీపీ తెగులు పట్టుకుందని విమర్శించారు. చంద్రబాబుకు మద్దతిచ్చేందుకే రాజమహేంద్రవరంలో భేటీ అయ్యామని పవన్ పేర్కొన్నారు.

    వైసీపీని ఇంటికి పంపాల్సిందే: పవన్

    వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాల్సిన సమయం వచ్చిందని జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. వైసీపీ నేతలు అన్ని పార్టీల నాయకుల్నీ ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధే జనసేనకు ముఖ్యమని తెలిపారు. టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ భేటీ ముగిసింది. అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. ఈ రాష్ట్రానికి వైసీపీ తెగులు పట్టుకుందని విమర్శించారు. చంద్రబాబుకు మద్దతిచ్చేందుకే రాజమహేంద్రవరంలో భేటీ అయ్యామని పవన్ పేర్కొన్నారు.

    నేతలకు పవన్ దిశానిర్దేశం

    అమరావతి జనసేన కార్యాలయంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నేతలతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో నేతలకు ఆయన పలు సూచనలు చేశారు. టీవీ చర్చలు, ప్రెస్‌ మీట్లు, సోషల్‌ మీడియా ప్రచారంలో జాగ్రత్త వహించాలని చెప్పారు. చర్చల్లో పార్టీ విధానాలకు కట్టుబడి మాట్లాడాలని తెలిపారు. వ్యక్తిగత అభిప్రాయాలు, దూషణలకు తావు లేదన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార ప్రతినిధులు బాధ్యత వహించాలని పవన్ సూచించారు.

    సీఎం పదవి కాదు ప్రజల భవిష్యత్తే ముఖ్యం: పవన్

    సీఎం పదవి కంటే ప్రజల భవిష్యత్తే ముఖ్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించేలా కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా పని చేయాలని దిశానిర్థేశం చేశారు. టీడీపీ-జనసేన ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. తాను ఏరోజూ సీఎం పదవి కోసం విముఖత చూపలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైన సరిచేసుకుని ముందుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పవన్ సూచించారు.

    టీడీపీ-జనసేన కార్యాచరణపై పవన్ చర్చ

    ఏపీలో రాజకీయ పరిస్థితులపై జనసేన పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ చెర్చించారు. ఐదో విడత వారాహి యాత్ర, టీడీపీ-జనసేన సమన్వయ కమిటీల ఉమ్మడి సమావేశంపై పార్టీ నేతలతో పవన్ చర్చించారు. రైతుల ఇబ్బందులు సాగునీరందక కృష్ణా, పశ్చిమ డెల్టాలో 4లక్షల ఎకరాలు ఎండిపోయిన అంశంపై పవన్ చర్చించారు. రైతుల పక్షాన నిలవాలని, అందుకు చేపట్టే పోరాటంపై ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉందని పవన్ ఆరోపించారు.

    ‘టీడీటీ అధికారంలోకి వస్తే పరిస్థితేంటి’

    వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే వైసీపీ నేతల పరిస్థితేంటని ఆ పార్టీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే వైసీపీ నాయకుల తాట తీస్తామంటూ టీడీపీ, జనసేన నేతలు హెచ్చరిస్తున్నారని తెలిపారు. వారు అధికారంలోకి వస్తే మన పరిస్థితి ఎలా ఉంటుందో పార్టీ శ్రేణులు ఆలోచించాలన్నారు. వాలంటీర్లు 90 శాతం మంది వైసీపీ మద్ధతుదారులు ఉన్నారని చెప్పారు. వారు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే మారుస్తామని బాలినేని పేర్కొన్నారు.

    ఎన్డీయేలో ఉంటే ఏంటి లేకపోతే ఏంటి?: పవన్

    కైకలూరు వద్ద ముదినేపల్లిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ‘టీడీపీ-జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల సమస్యలు తీరుస్తాం. నేను ఎన్డీయే కూటమితో ఉంటే ఏంటి లేకపోతే ఏంటి? వైసీపీకి ఎందుకు అంత భయం. మేము గెలిచిన రోజున దమ్ముంటే వైసీపీ నేతలు ఇళ్లలోనో ఆఫీసుల్లోనో కూర్చోండి చూద్దాం. ఏ పోలీసులతో కేసులు పెట్టించారో అదే పోలీసులతో మక్కెలు ఇరగతీయిస్తాం. భవిష్యత్తులో వైసీపీ గెలిస్తే ప్రజలు ఆస్తి ప్రతాలు జగన్ చేతుల్లో ఉంటాయి’. అని పవన్ ఆరోపించారు.

    ఏపీలో జనసేన బలం పెరిగింది: పవన్‌

    AP: మచిలీపట్నంలో జరిగిన వారాహి యాత్రలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జనసేన బలం 14% నుంచి 18% పెరిగిందని పేర్కొన్నారు. అంచలంచెలుగా అధికారంలోకి రాగలం తప్ప ఒకేసారి గెలవలేమని స్పష్టం చేశారు. ఒంటరిగా వెళితే అధికారంలో వస్తామా? అనేది తనకు సందేహమేనన్నారు. పొత్తుతో వెళితే బలమైన సీట్లు వస్తాయని అంచనా వేశారు. తద్వారా అసెంబ్లీలో బలమైన పాదముద్ర పడుతుందని జోస్యం చెప్పారు. సీఎం అవుతానా? లేదా? అనేది గెలుపు నిష్పత్తిని బట్టి ఉంటుందని పవన్ అన్నారు.