• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కాంగ్రెస్‌కు మళ్లీ 20 సీట్లే వస్తాయి: KCR

    ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మళ్లీ 20 సీట్లు మాత్రమే వస్తామని సీఎం కేసీఆర్ జోష్యం చెప్పారు. మధిరలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు. దేశానికే అన్నపూర్ణగా తెలంగాణ తయారైందని చెప్పారు. కాంగ్రెస్‌ అభ్యర్థి భట్టి విక్రమార్కకు ఓటు వేస్తే ప్రజలు నష్టపోతారన్నారు. కాంగ్రెస్‌కు మళ్లీ 20 సీట్లు మాత్రమే వస్తాయని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.

    రాష్ట్రానికి కేసీఆర్ చేసిందేమి లేదు: రేవంత్

    బీఆర్‌ఎస్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో పండిపడ్డారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. బిల్లులు రావడం లేదని సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ విజయం సాధిస్తే రైతుబంధు ఆపేస్తామని కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ వస్తే రైతులతో పాటు కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని రేవంత్ హమీ ఇచ్చారు.

    ఓటు వేసే ముందు ఆలోచించండి: KCR

    కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పార్టీల చరిత్ర, నడవడిక చూసి ఓటేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తొర్రూరులో బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు. ఓటు వేసే ముందు ప్రజలు అన్నీ ఆలోచించి వేయాలి. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలకుర్తి ఎంతో అభివృద్ధి చెందింది. పదేళ్ల ముందు పాలకుర్తి ఎలా ఉంది.. ఇప్పుడెలా ఉందో ప్రజలు ఆలోచించాలి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధు అపేస్తుంది’.అని కేసీఆర్ పేర్కొన్నారు.

    ప్రజలు విచక్షణతో ఓటు వేయాలి: KCR

    ఎన్నికల్లో ప్రజలు విచక్షణతో ఓటు వేయాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ మాట్లాడారు. సేవ చేసే వ్యక్తులకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. 2004 ఎన్నికలకు ముందు తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చిందన్నారు. ఎన్నికలు అవగానే ఇచ్చిన హామీని ఆ పార్టీ విస్మరించిందని చెప్పారు. బీఆర్‌ఎస్ పోరాటానికి భయపడి కాంగ్రెస్‌ ప్రత్యేక తెలంగాణ ఇచ్చిందని తెలిపారు.

    ఓటర్లు పరిణతితో ఆలోచించాలి: కేసీఆర్

    ఓటర్లు పరిణతితో ఆలోచించి ఓటేస్తేనే ప్రజాస్వామ్యం గెలుస్తుందని సీఎం కేసీఆర్‌ అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్రలో ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. ప్రజలు తమ ఓటు హక్కును సరిగ్గా వాడితే మంచి భవిష్యత్‌ ఉంటుంది. వలసలు వెళ్లి చాలా బాధలు అనుభవించిన జిల్లా పాలమూరు. గతంలో ఎదుర్కొన్న గడ్డు పరిస్థితులకు కాంగ్రెస్‌ కారణం వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి.’ అని కేసీఆర్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

    నామినేషన్‌ పత్రాలతో కేసీఆర్‌ ప్రత్యేక పూజలు

    సిద్దిపేట జిల్లా కోనాయిపల్లి గ్రామ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సీఎం కేసీఆర్‌ దర్శించుకున్నారు. ఆలయంలో నామినేషన్‌ పత్రాలతో ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఎన్నికల్లో గజ్వేల్‌, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగుతున్న కేసీఆర్‌ తాను దాఖలు చేయనున్న నామినేషన్‌ పత్రాలకు పూజలు చేశారు. నామపత్రాలను స్వామి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. సీఎం కేసీఆర్‌ ఈ నెల 9న ఉదయం గజ్వేల్‌లో, మధ్యాహ్నం కామారెడ్డిలో నామపత్రాలు దాఖలు చేయనున్నారు.

    అబద్ధాలు నమ్మి.. ఓటు వేయొద్దు: KCR

    ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఎవరో వచ్చి చెప్పిన అబద్ధాలు నమ్మి.. ఓటు వేయొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. దేశంలో 24 గంటల విద్యుత్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. రైతుబంధును కాంగ్రెస్‌ నేతలు విమర్శిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్‌ను ఎత్తెస్తుందన్నారు. రాష్ట్రానికి బీజేపీ ఏమీ ఇవ్వలేదని చెప్పారు. ఇప్పుడు ఎన్నికల్లో ఓట్లు ఎలా అడుగుతుందని ప్రశ్నించారు. దశాబ్దాలుగా వెనకబడి ఉన్న ఎస్సీలు బాగుపడాలనే దళితబంధు తీసుకొచ్చానని’. కేసీఆర్‌ తెలిపారు.

    ప్రజల హక్కుల కోసమే BRS పుట్టింది: KCR

    ప్రజల హక్కుల కోసమే బీఆర్‌ఎస్ పెట్టిందని సీఎం కేటీఆర్ అన్నారు. 15 ఏళ్ల పోరాడి తెలంగాణను సాధించుకున్నామని తెలిపారు. నిర్మల్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం మాట్లాడుతూ.. ‘రైతులకు మేలు చేసే ఉద్దేశంతో రైతుబంధు తీసుకొచ్చాం. దాన్ని కాంగ్రెస్ దుబారా ఖర్చు అని అంటుంది. ఇప్పటికే చాలా మంది రైతుల రుణమాఫీ చేశాం. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో మరి కొందరికి పూర్తి చేయలేక పోయాం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధు. ధరణి తస్తుంది. అప్పుడు అవి రెండూ కూడా ఆగిపోతాయి’ అని … Read more

    కేసీఆర్‌పై పోటీకి సిద్ధం: రేవంత్‌

    TG: అధిష్ఠానం ఆదేశిస్తే కామారెడ్డిలో పోటీకి సిద్ధమేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. తానైనా, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అయినా పార్టీ ఆదేశిస్తే కేసీఆర్‌పై పోటీ చేస్తామని తెలిపారు. ‘కేసీఆర్‌, కేటీఆర్‌ను చిత్తుగా ఓడించేందుకు సిద్ధంగా ఉన్నాం. కొడంగల్‌ నుంచి పోటీ చేయాలని కేసీఆర్‌ను ఆహ్వానించా. కొడంగల్‌కు పోటీకి కేసీఆర్‌ రాకపోతే కామారెడ్డిలో పోటీకి నేను సిద్ధం. ఉమ్మడి ఏపీ సహా తెలంగాణలో ఎప్పుడూ హంగ్‌ రాలేదు. రెండింట మూడో వంతు మెజారిటీతో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుంది’ అని అన్నారు.

    కేసీఆర్‌కు పోటీగా కామారెడ్డి బరిలో రేవంత్‌!

    TG: పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కామారెడ్డి నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నట్లు తెలిసింది. సీఎం కేసీఆర్‌ గజ్వేల్‌తోపాటు కామారెడ్డిలో పోటీ చేస్తున్న నేపథ్యంలో రేవంత్‌ను కూడా కొడంగల్‌తోపాటు కామారెడ్డి నుంచి పోటీ చేయించాలని పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కామారెడ్డి నుంచి టికెట్‌ ఆశించిన మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. తాజా నిర్ణయం నేపథ్యంలో షబ్బీర్‌అలీకి ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో పార్టీ తరఫున ప్రచార బాధ్యతలను అప్పగించనున్నట్లు తెలిసింది.