యాంకర్ రష్మీ ఇంట విషాదం
జబర్దస్త్ యాంకర్, హీరోయిన్ రష్మీ గౌతమ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. రష్మీ అమ్మమ్మ ప్రమీలా మిశ్రా కన్నుమూశారు. ఈ విషయాన్ని రష్మీ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. బరువెక్కిన గుండెతో ఆమెకు కడసారి వీడ్కోలు పలికామని ఎమోషనల్ ట్వీట్ చేసింది. ‘‘ప్రమీలా మిశ్రా ఉక్కు మహిళ. ఆమె ప్రభావం మాపై ఎంతో ఉంది. ఆమె జ్ణాపకాలు ఎప్పుడూ మాతోనే ఉంటాయి. ఓంశాంతి.’’ అంటూ భావోద్వేగానికి గురైంది. కాగా రష్మి రీసెంట్గా ‘బొమ్మ బ్లాక్బస్టర్’ మూవీతో వెండితెరపై తళుక్కుమంది.