• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘అప్పుడు అభిమానిని.. ఇప్పుడు అతిథిని’

    ఒకప్పుడు శిల్పాకళావేదికలో జరిగే ఈవెంట్లకు ఫ్యాన్ పాసులు దొరక్క వెనక్కి వెళ్లిపోయానని, కానీ ఇప్పుడు అదే వేదికపైకి అతిథిగా వచ్చానని హీరో నవీన్ పొలిశెట్టి అన్నారు. దీనికి కారణం తెలుగు ప్రేక్షకులేనని చెప్పారు. ‘స్వాతిముత్యం’ ప్రి రిలీజ్ వేడుకకు నటుడు సిద్ధు జొన్నలగడ్డతో కలసి నవీన్ హాజరయ్యారు. నటీనటులపై ప్రేమాభిమానాలు కురిపించి సినిమాలను విజయవంతం చేసేది ప్రేక్షకులేనని పేర్కొన్నారు. మళ్లీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాని చెప్పారు. ఈ సందర్భంగా వర్ష బొల్లమ్మతో కలసి ‘చిట్టి నీ నవ్వంటే’ పాటకు డ్యాన్స్ వేసి అలరించారు.