• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వాడు ఆంటీ అంటే కమ్మగా ఉంది: అనసూయ

    యాంకర్ అనసూయ సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా ఫేమస్ అయ్యింది. ఇటీవల ఆంటీ..ఆంటీ అని నెటిజన్లు పిలుస్తుంటే ఆమె రచ్చ రచ్చ చేసి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. తాజాగా ఓ ప్రెస్ మీట్‌లో చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ ధృవన్..అనసూయను ఆంటీ అని పిలిచాడు. దీంతో వెంటనే మైక్ తీసుకుని ‘‘వాడు ఆంటీ అనొచ్చు.. వాడు పిలిస్తే చాలా కమ్మగా ఉంది. వాడు పిలవడంలో తప్పు లేదు.’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. తనని ఆంటీ అని … Read more

    నేను ఆ ముగ్గురినే నమ్ముతా; బాలకృష్ణ

    తాను సినిమాల విషయంలో ముగ్గురిని మాత్రమే నమ్ముతానని సినీ హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్‌ను పూర్తిగా నమ్ముతానని చెప్పారు. ‘వీరసింహారెడ్డి’ విజయంతో మూవీ టీమ్ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసింది. ‘‘తాను నటించిన ‘వీరసింహారెడ్డి’ని ఆదరించినందుకు కృతజ్ణతలు. ఈ సినిమా కోసం ప్రతి డిపార్ట్‌మెంట్ తీవ్రంగా కృషి చేసింది. తమన్ పాటలను మరో స్థాయికి తీసుకెళ్లారు. మంచి ఔట్‌పుట్ రాబట్టగలిగే సత్తా గోపీచంద్‌కు ఉంది.’’ అంటూ బాలయ్య పేర్కొన్నారు.

    ఇక‌పై టిక్కెట్ల ధ‌ర‌లు ఇవే ఉంటాయ‌న్న దిల్‌రాజు

    ప్ర‌ముఖ నిర్మ‌త దిల్‌రాజు నేడు ‘థ్యాంక్యూ’ మూవీ ప్రెస్‌మీట్‌లో మీడియాతో మాట్లాడుతూ టిక్కెట్ల ధ‌ర‌ల‌పై స్ప‌ష్ట‌త‌నిచ్చారు. హైద‌రాబాద్‌, వ‌రంగ‌ల్ వంటి న‌గ‌రాల్లో సింగిల్ స్క్రీన్ రూ.150+GST, మ‌ల్టిప్లెక్స్ రూ.200+GST ఉంటుందని చెప్పారు. స్టార్ హీరోల సినిమాలు, భారీ బ‌డ్జెట్ చిత్రాలు మిన‌హాయించి ఇక‌పై అన్ని సినిమాల‌కు టిక్కెట్ ధ‌ర‌లు ఇదేవిధంగా ఉంటాయ‌ని వెల్ల‌డించారు. థ్యాంక్యూ మూవీ జులై 22న రిలీజ్ కానుంది. టిక్కెట్ బుకింగ్స్ ఇప్ప‌టికే ప్రారంభ‌మ‌య్యాయి.