జైలులో నరకం అనుభవించా: బాలీవుడ్ నటి
డ్రగ్స్ కేసులో దుబాయ్లో జైలు జీవితం అనుభవిస్తున్న బాలీవుడ్ హీరోయిన్ క్రిసాన్ పెరీరా విడుదలైంది. ఈ క్రమంలో జైలులో తాను పడ్డ కష్టాలను చెప్పుకొచ్చింది. ‘‘26 రోజులు నరకం అనుభవించాను. టైడ్ సర్ఫ్తో స్నానం చేశారు. టాయిలెట్ వాటర్తో తయారు చేసిన కాఫీ తాగాను. అక్కడ లెటర్ రాసేందుకు పెన్ కూడా దొరకలేదు. పెన్ దొరకడానికి 20 రోజుల సమయం పట్టింది. ఆ నరకం జీవితంలో మరెప్పుడూ రాకూడదు. పగవాడికి కూడా ఇలాంటి గతి పట్టకూడదు.’’ అంటూ క్రిసాన్ చెప్పుకొచ్చింది.