• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బస్సు రెడీగా ఉంది కేటీఆర్ సిద్ధమా?: రేవంత్ రెడ్డి

    కర్ణాటక డిప్యూటి సీఎం డీకే శివకుమార్‌పై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తిప్పి కొట్టారు. ‘కర్ణాటకలో హామీలన్నీ అమలు అవుతున్నాయి. వాటిపై కేసీఆర్, కేటీఆర్ అబద్ధాలు చెబుతున్నారు. కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ విసిరిన సవాల్‌కు కేసీఆర్, కేటీఆర్ తోక ముడిచారు. బస్సు రెడీగా ఉంది, ప్రగతి భవన్ రావాలా, ఫాం హౌస్‌కు రమ్మంటావా.. బస్సులో నేరుగా కాళేశ్వరం వెళ్లి చూద్దాం.. అక్కడి నుండి కర్ణాటకకు వెళ్దాం, సిద్ధమా? అని ప్రశ్నించారు.

    పరిగికి నీళ్లు ఎందుకు తేలేదు: రేవంత్

    కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే కేసీఆర్‌ రెండుసార్లు సీఎం అయ్యారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ‘కేసీఆర్‌ కుటుంబంలో అందరికి పదవులు వచ్చాయి. ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీళ్లు ఇస్తామన్నారు ఏమైంది?.. కొడంగల్‌ వరకు గోదావరి జలాలు తీసుకొస్తామని వైఎస్సార్ హామీ ఇచ్చారు.. ఏపీవాళ్లు తెలంగాణ నీళ్లు తీసుకెళ్లారని కేసీఆర్‌ ఆనాడు విమర్శించారు. పరిగికి కేసీఆర్‌ ఎందుకు నీళ్లు తీసుకురాలేదు? భూముల్ని ఆక్రమించిన మిమ్మల్ని వదిలిపెట్టం’ అని హెచ్చరించారు.

    కాంగ్రెస్‌లోకి మోత్కుపల్లి

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. టీకాంగ్రెస్‌లోకి వలసలు పెరుగుతున్నాయి. తాజాగా మరికొందరు సీనియర్‌ రాజకీయ నేతలు హస్తం గూటికి చేరారు. నేడు జాతీయ కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, ఎమ్మెల్సీ ఆకుల లలిత, మాజీ ఎమ్మెల్సీలు నేతి విద్యాసాగర్‌, కపిలవాయి దిలీప్‌ కుమార్‌తో పార్టీలో చేరారు. వీరందరికీ ఖర్గే పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు.

    కేసీఆర్‌పై పోటీకి సిద్ధం: రేవంత్‌

    TG: అధిష్ఠానం ఆదేశిస్తే కామారెడ్డిలో పోటీకి సిద్ధమేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. తానైనా, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అయినా పార్టీ ఆదేశిస్తే కేసీఆర్‌పై పోటీ చేస్తామని తెలిపారు. ‘కేసీఆర్‌, కేటీఆర్‌ను చిత్తుగా ఓడించేందుకు సిద్ధంగా ఉన్నాం. కొడంగల్‌ నుంచి పోటీ చేయాలని కేసీఆర్‌ను ఆహ్వానించా. కొడంగల్‌కు పోటీకి కేసీఆర్‌ రాకపోతే కామారెడ్డిలో పోటీకి నేను సిద్ధం. ఉమ్మడి ఏపీ సహా తెలంగాణలో ఎప్పుడూ హంగ్‌ రాలేదు. రెండింట మూడో వంతు మెజారిటీతో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుంది’ అని అన్నారు.

    భారాసపై ఈసీకి కాంగ్రెస్‌ ఫిర్యాదు

    TG: భారాస ప్రభుత్వం ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తోందని తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. దీనిపై ఢిల్లీలో కేంద్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన ఆయన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘సంక్షేమ పథకాల నగదు బదిలీపై ఎన్నికల అధికారులకు సూచనలు చేశాం. నోటిఫికేషన్‌కు ముందే నగదు బదిలీ పూర్తి అయ్యేలా ఆదేశాలివ్వాలని చెప్పాం. భారాస కార్యకర్తల్లా పని చేస్తున్న అధికారులను బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశాం. నిష్పక్షపాతంగా వ్యవహరించే అధికారులను రాష్ట్రంలో నియమించాలని ఈసీని కోరాం’ అని రేవంత్ తెలిపారు.

    కేసీఆర్‌కు పోటీగా కామారెడ్డి బరిలో రేవంత్‌!

    TG: పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కామారెడ్డి నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నట్లు తెలిసింది. సీఎం కేసీఆర్‌ గజ్వేల్‌తోపాటు కామారెడ్డిలో పోటీ చేస్తున్న నేపథ్యంలో రేవంత్‌ను కూడా కొడంగల్‌తోపాటు కామారెడ్డి నుంచి పోటీ చేయించాలని పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కామారెడ్డి నుంచి టికెట్‌ ఆశించిన మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. తాజా నిర్ణయం నేపథ్యంలో షబ్బీర్‌అలీకి ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో పార్టీ తరఫున ప్రచార బాధ్యతలను అప్పగించనున్నట్లు తెలిసింది.

    80 స్థానాల్లో గెలుపు ఖాయం: రేవంత్

    TG: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 80 స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే కాంగ్రెస్‌ రెండో జాబితా విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే రెండో విడత అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ ఆదివారం ఢిల్లీలో సమావేశమైంది. ఈ భేటిలో అభ్యర్థుల ఎంపిక, పొత్తులో ఉన్న పార్టీలకు సీట్ల కేటాయింపుపై సుదీర్ఘంగా చర్చించింది. ఈ నెల 25 లేదా 26వ తేదీన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుండగా ఆ తర్వాత రెండో … Read more

    కేసీఆర్‌ను ఎందుకు గద్దే దించాలి: కేటీఆర్

    టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. ‘ఒకప్పుడు బలిదేవత అని సోనియా గాంధీని విమర్శించిన రేవంత్‌కు ఇప్పుడు ఆమె దేవత అయిందా? కాంగ్రెస్‌కు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికే 11 సార్లు ప్రజలు ఛాన్స్ ఇచ్చారు. కాంగ్రెస్ ఏం చేసింది? కేసీఆర్‌ను గద్దే దించాలని అంటున్నారు. రైతులకు రైతు బంధు ఇచ్చినందుకు గద్దే దించాలా? ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మి ఇచ్చినందుకు దింపాల? ఆసరా పెన్షన్లు పెంచినందుకు దించాలా? ఎందుకు దించాలి’ అని ప్రశ్నించారు.

    ‘రాహుల్ గాంధీకి సొంత ఇల్లు కూడా లేదు’

    టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోసారి సీఎం కేసీఆర్‌పై ఫైరయ్యారు. కేసీఆర్ మాయమాటలతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాడని ఆరోపించారు. ‘తెలంగాణలో నాగార్జున సాగర్, శ్రీరామ్‌సాగర్, నెట్టెంపాడు వంటి భారీ ప్రాజెక్టులను కాంగ్రెస్ నిర్మించింది. హైదరాబాద్‌కు ఐటీ ప్రాజెక్టులు, విమానాశ్రయం, మెట్రో రైలు మంజూరు చేసింది. నెహ్రూ స్వాతంత్ర్యం కోసం పోరాడి జైలుకు వెళ్లారు. ఇందిరా గాంధీ దేశం కోసం ప్రాణ త్యాగం చేశారు. ఇన్నేళ్లు ఎంపీ పదవుల్లో ఉన్నప్పటికీ రాహుల్ గాంధీకి సొంత ఇల్లు లేదు’. అని రేవంత్ తెలిపారు.

    సిద్ధాంతాల మీద ఓట్టు అడుగుదాం: రేవంత్

    పక్క రాష్ట్రాల నుంచి కాంగ్రెస్‌కు భారీగా నిధులు సమకూరుతున్నాయన్న వార్తలను రేవంత్ రెడ్డి ఖండించారు. కావాలనే బీఆర్ఎస్ తమపై తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నికలో మీరు మద్యం, డబ్బు పంచడం వల్ల బీఆర్ఎస్ గెలిచిందని చాలా మంది అంటున్నారు. ఇప్పుడు చెబుతున్నా.. డబ్బు, మద్యం పక్కన పెడుదాం. ఈ ఎన్నికల్లో కేవలం సిద్ధాంతాల మీద ప్రజలను ఓట్లు అడుగుదాం. మాతో కలిసొచ్చే దమ్ము బీఆర్‌ఎస్‌కు ఉందా అని ప్రశ్నించారు.