వైఎస్ వివేకా హత్య కేసులో కీలక మలుపు
ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసు విచారణను తెలగాణకు బదిలీ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. విచారణపై మృతుడి భార్య, కుమార్తె అసంతృప్తితో ఉన్నందున పక్క రాష్ట్రానికి బదిలీ చేస్తున్నట్లు సుప్రీం తెలిపింది. కడపలో విచారణ జరగడం కంటే హైదరాబాద్లో కొనసాగడమే సముచితంగా భావిస్తున్నామని కోర్టు పేర్కొంది. కాగా వివేకా హత్య కేసు విచారణకు స్థానిక యంత్రాంగం ఏమాత్రం సహకరించడం లేదని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది.