• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పోలీసులతో మీ మక్కెలు విరగ్గొట్టిస్తాం: పవన్

    మచిలిపట్నం వారాహి యాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఏపీని వైసీపీ రహిత రాష్ట్రంగా మార్చుతాం. మేం ఏమీ మర్చిపోలేదు. ఇదే పోలీసు స్టేషనులో పంచాయితీ పెడతాం మీకు. ఏ పోలీసులను మీరు ఇబ్బంది పెట్టారో అదే పోలీసులతో మీ మక్కెలు విరగ్గొట్టిస్తాం. కొల్లేరు ప్రజలకు జనసేన, టీడీపీ వచ్చి బలమైన న్యాయం చేస్తాం. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్ధులకు అసలు సర్టిఫికేట్‌లు ఇవ్వలేకపోయారు. ప్రింటింగ్ ప్రెస్‌లతో షేర్ కుదరలేదా?’ అని విమర్శించారు.

    రైతుల త్యాగాలు వృథా కావు: భువనేశ్వరి

    టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అడ్డదారిలో వెళ్తూ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వంలో అమరావతి నిర్మాణం జరిగితీరుతుందన్నారు. భూములిచ్చిన రైతుల త్యాగాలు వృథా కావని చెప్పారు. ఓట్ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇటువంటి క్లిష్ట సమయంలో ప్రజల మద్దతు కొండంత ధైర్యాన్ని ఇస్తుందని భువనేశ్వరి చెప్పుకొచ్చారు.

    చంద్రబాబుపై మరో కేసు

    చంద్రబాబుపై వరుస కేసులు పెడుతూ వైసీపీ శ్రేణులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు పేరును చేర్చాలని సుప్రీంకోర్టును మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఆశ్రయించారు. తెలంగాణ ఏసీబీ ఛార్జిషీట్‌లో 22 సార్లు చంద్రబాబు పేరు ప్రస్తావన ఉందని గుర్తు చేశారు. ఈ కేసు విచారణ పురోగతిపై ఆరా తీయ్యాలని కోర్టును కోరారు. అక్టోబరు 3న ఈ కేసును సుప్రీంకోర్టు విచారించనుంది. ఇప్పటికే స్కిల్ స్కాం, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుల్లో చంద్రబాబు ముద్దాయిగా ఉన్నారు.