మాండూస్ తుఫాన్ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలకు శుక్రవారం మధ్యాహ్నం సెలవు ప్రకటిస్తున్నట్లు ఆ జిల్లా కలెక్టర్ హరినారాయణన్ ప్రకటించారు. కాగా మాండూస్ తుఫాన్ ప్రభావంతో తిరుపతిలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. తిరుపతి నగర పాలక కార్యాలయంలో హెల్ప్లైన్ నంబర్ 08772256766 ఏర్పాటు చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. లోతట్లు, ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారని ఆదేశించారు.
‘మాండూస్’ ఎఫెక్ట్; విద్యార్థులకు సెలవు

© ANI Photo