ఇరాన్లో నిరంకుశత్వం రాజ్యమేలుతోంది. బాలికా విద్యను అణచివేయడానికి తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా పాఠశాల విద్యార్థినులపై విష ప్రయోగానికీ వెనుకాడట్లేదు. గత కొద్ది రోజులుగా ఈ తరహా చర్యల వల్ల ఏకంగా 700మందికి పైగా విద్యార్థులు బాధితులయ్యారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే, ఇదంతా ఎవరు చేస్తున్నారనే విషయంపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. ప్రభుత్వం మొక్కుబడిగా చర్యలు తీసుకుంటూ చేతులు దులుపుకొంటుంది. ఏదేమైనా గత కొద్ది కాలంగా ఇరాన్ అశాంతికి కేంద్రంగా నిలుస్తోంది.