కాలం చెల్లిన ఉపగ్రహాలను నియంత్రిత విధానంలో కూల్చివేయడంపై ఇస్రో కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా తక్కువ భూకక్ష్యలో పరిభ్రమించే మేఘ-ట్రోపికస్-1(ఎంటీఐ) ఉపగ్రహాన్ని ఇస్రో కూల్చనుంది. ఈ ఉపగ్రహం ఇవాళ సాయంత్రం 4:30 నుంచి రాత్రి 7.30లోపు భూమిపై కూలిపోవచ్చని అంచనా వేస్తున్నారు. పసిఫిక్ మహాసముద్రంలోని నిర్జన ప్రదేశంలో ఇది పడేలా మార్గాన్ని నిర్దేశించారు. భూవాతవరణ ఘర్షణకు కూడా ఈ ఉపగ్రహం తట్టుకొంటుందని చెబుతున్నారు.