బోర్డర్-గావస్కర్ ట్రోపీలో భాగంగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ ఉస్మాన్ ఖవాజా అద్భుత సెంచరీ బాదిన సంగతి తెలిసిందే. ఖవాజాకు భారత గడ్డపై ఇదే తొలి శతకం. దీంతో ఖవాజా తొలి రోజు ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత ఎమోషనల్ అయ్యాడు. ‘‘గతంలో రెండు సార్లు భారత పర్యటనకు వచ్చా. కానీ డ్రింక్స్ మాత్రమే మోశాను. ఇప్పుడు సెంచరీ బాదాను. ఈ శతకం నాకు ఎంతో ప్రత్యేకం. అందుకే ఎంతో సంతోషంగా ఉంది.’’ అంటూ ఖవాజా పేర్కొన్నాడు.