ఏపీలోని విశాఖపట్నంలో దొంగలు ఏకంగా పోలీస్ స్టేషన్లోనే దొంగతనం చేశారు. నగరంలోని మల్కాపురం పోలీస్ స్టేషన్ పాత క్వార్టర్స్లో ఈ చోరీ జరిగింది. ఇటీవల ఓ కేసుకు సంబంధించి రెండు టన్నుల ఇనుమును పోలీసులు స్వాధీనం చేసుకుని క్వార్టర్స్లో దాచారు. ఈ క్రమంలో అక్కడ దాచిన ఐరన్ను రాత్రికిరాత్రే దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనతో షాక్ తిన్న పోలీసులు తమ పోలీస్ స్టేషన్లోనే కేసు నమోదు చేశారు. నిందితుల కోసం నగర పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.