టీఎస్పీఎస్సీ పరీక్షా పేపర్లు హ్యాక్ చేసిన 11 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో టీఎస్పీఎస్సీ ఉద్యోగి ప్రవీణ్, మరో కాంట్రాక్టు ఉద్యోగి కూడా ఉన్నారు. పేపర్ లీకేజీ సూత్రధారి రేణుక, ఆమె భర్త, సోదరుడితో సహా పరీక్షా పేపర్లు కొన్న ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. కాగా టీఎస్పీఎస్సీ నిర్వహించే టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షా పేపర్లు హ్యాకింగ్కు గురైన సంగతి తెలిసిందే. దీనిపై బేగం బజార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.