అసిస్టెంట్ ఇంజినీరింగ్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. పేపర్ లీక్ అయినట్లు నిర్ధారణ కావడంతో ఈ పరీక్షను రద్దు చేసింది. కాగా ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీగా ఉన్న 837 పోస్టులకు ఈ నెల 5న ఏఈ పరీక్ష జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 55 వేల మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాశారు. ఈ క్రమంలో ఏఈ ఎగ్జామ్ పేపర్ లీక్ కావడంతో రద్దు చేశారు. కాగా మళ్లీ ఈ పరీక్షను ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై టీఎస్పీఎస్సీ క్లారిటీ ఇవ్వలేదు.