సీబీఐ విచారణ తప్పుదోవ పడుతుందని ఎంపీ అవినాశ్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో మూడోసారి విచారణకు హాజరైన అవినాశ్… దర్యాప్తు ముగిసిన అనంతరం మాట్లాడారు. “ నేను ఎలాంటి తప్పు చేయలేదు. నాపై ఆరోపణల్లో పెద్ద కుట్ర ఉంది. కట్టుకథను అడ్డం పెట్టుకొని విచారణ జరుపుతున్నారు. న్యాయపోరాటం చేస్తాం. మళ్లీ పిలిచినప్పుడు విచారణకు రమ్మన్నారు. ఈ కేసులో వివేకా రెండో పెళ్లి కూడా కీలక అంశం. వాళ్ల కొడుకును వారసుడిని చేయాలనుకున్నాడు. ఆస్తులను వారిపేరు మీద రాయాలనుకున్నారు. ఆస్తుల కోసమే హత్య జరిగింది.” అని పేర్కొన్నారు.