ఖలీస్తాన్ సానుభూతిపరుడు వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్పాల్ సింగ్ను పట్టుకునేందుకు పోలీసుల వేట కొనసాగుతోంది. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడని…. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. పంజాబ్తో పాటు పొరుగున ఉన్న హిమాచల్ ప్రదేశ్లోనూ హైఅలెర్ట్ ప్రకటించారు. పోలీసుల తనిఖీల్లో జలంధర్తో బైక్పై వెళ్తున్నట్లు గుర్తించిన పోలీసులు… పట్టుకునేందుకు యత్నించారు. కానీ, తప్పించుకున్నాడు. ఇప్పటికే వారిస్ పంజాబ్ దేకి చెందిన 78 మంది సభ్యులను అరెస్ట్ చేశారు.