దిల్లీ జంతర్మంతర్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేపట్టిన భారత్ జాగృతి దీక్ష ముగిసింది. మహిళా రిజర్వేషన్ బిల్లు సమర్థిస్తూ పలువురు నేతలు సంతకాలు చేశారు. అందరూ సంతకాలు చేసిన లేఖను రాష్ట్రపతి, ప్రధానికి పంపుతామని వెల్లడించారు. “ భాజపా అనుకుంటే మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించవచ్చు. కానీ, అలా జరగట్లేదు. మహిళా బిల్లు ఆమోదం పొందేవరకు పోరాడతాం” అని కవిత అన్నారు.